మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే తొలి జాబితాపై వచ్చిన ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాపై ఆచితూచి అడుగులు వేస్తోంది. కానీ, ఈ జాబితాలో కూడ సీనియర్లకు సీటు దక్కలేదు.
రెండో జాబితాలో టికెట్లను ఖరారు చేసుకున్న అభ్యర్థులు వీరే.
ఖానాపూర్ (ఎస్టీ) – రమేష్ రాథోడ్
ఎల్లారెడ్డి – జాజల సురేందర్
ధర్మపురి (ఎస్సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి
మేడ్చల్ – కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
ఖైరతాబాద్ – దాసోజు శ్రవణ్
జూబ్లీహిల్స్ – పి. విష్ణువర్ధన్ రెడ్డి
షాద్ నగర్ – సి. ప్రతాప్ రెడ్డి
భూపలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
పాలేరు – ఉపేందర్ రెడ్డి
టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయనుండటం గమనార్హం. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ఈ జాబితాలో కూడా చోటు దక్కకపోవడం విశేషం.