Tuesday, May 7, 2024
- Advertisement -

తెరదించిన బిజేపి.. అభ్యర్థుల ప్రకటన..!

- Advertisement -

గత కొంత కాలంగా తెలంగాణలో బీజేపీ మంచి ఫామ్ లో కొనసాగుతుంది. దుబ్బాక ఎన్నికల నుంచి మొన్నటి జీహెచ్ఎంసీ వరకు ఎన్నికల్లో తన సత్తా చాటుతూ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మరింత బలోపేతం కావడానికి కసరత్తు చేస్తుంది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు బిజేపి తన అభ్యర్థులను ప్రకటించింది.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావుకే మరోసారి అవకాశం ఇచ్చింది. వరంగల్-నల్గొండ-ఖమ్మం అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది.శాసనమండలి ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రెండు పట్టభద్రుల స్థానాల్లో నోటిఫికేషన్ జారీతో.. నామినేషన్లు స్వీకరిస్తారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ నియోజకవర్గానికి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గానికి నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆయా కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -