కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏంమాట్లాడినా సంచలనమే. ఎందుకంటే ఏం మాట్లాడినా లాజిక్ ఉంటుంది. బర్జెట్లో రాస్ట్రానికి నిధులు కేటాయించడంలో కేంద్రం మొండిచేయి చూపడంతో చంద్రబాబు ఎన్డీఏపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అవసరం అయితే ఎన్డీఏతో తెలగదెంపులు చేసుకోవాలని ఆపార్టీ ఎంపీలు వ్యాఖ్యానించారు.
అయితే బాబు కేంద్రంపై చేస్తున్న వ్యాఖ్యలపై ఉండవల్లి తాజాగా సెటైర్లు వేశారు. కేంద్రంతో చంద్రబాబు నాయుడు ఇప్పట్లో తెగదెంపులు చేసుకోలేరన్నారు. ఒకవేళ కేంద్రాన్ని చంద్రబాబు గట్టిగా ప్రశ్నిస్తే ఆయన్ని జైలుకు పంపిస్తే.. వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ చంద్రబాబు గెలుస్తాడు’ అనిఉండవల్లి అభిప్రాయ పడ్డారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరడగంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడుతున్న విషయమై ఉండవల్లి స్పందించారు. పార్లమెంట్ ఉభయసభల్లో వెల్ లోకి వెళ్లి గొడవ చేయండి’ అని తమ ఎంపీలకు చంద్రబాబు చెబుతున్నారు. అలా చేయడం వల్లే ఏం ప్రయోజనం ఉండదు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్నే ‘జైల్లో పెట్టేస్తారుట’ అనే మాటలు వింటున్నాం. చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడానికి కారణం ‘ఆయన మీద కేసులు ఉన్నాయిట .. జైల్లో పెట్టేస్తారట. ఇక కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించకపోవడానికి కారణం..ఆయన మీద కేసులున్నాయి’ అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయన్నారు. రాజకీయ నాయకుడనేవాడు జైలుకు వెళ్లడానికి భయపడటమేంటన్నారు. ఒకవేళ కేంద్రాన్ని చంద్రబాబునాయుడు గట్టిగా ప్రశ్నిస్తే ఆయన్ని జైలుకు పంపిస్తే.. వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ చంద్రబాబు గెలుస్తాడు’ అంటూ ఉండవల్లి చెప్పుకొచ్చారు. బాబు అంతపని చేస్తారా…?