ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీనా?.. సోమవారం చంద్రబాబు చేసిన ర్యాలీ ప్రభుత్వానిదా..? పార్టీదా..? నాలుగేళ్లు ఘోరాలు, పాపాలు చేసి ఇప్పుడు ర్యాలీలు చేస్తారా..? కాల్ మనీ కేసు రిపోర్ట్ ఏమైంది? ఎవరినైనా అరెస్టు చేశారా..? అని ప్రశ్నించారు
ఇక ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చిందని… ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు గౌరవంగా తప్పుకోవడం మంచిదని సూచించారు.
కాల్ మనీ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3,000 అత్యాచార ఘటనలు జరిగాయని… వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు రక్షణ కల్పిస్తున్న చంద్రబాబు… మహిళలకు రక్షణ కల్పిస్తానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు.