Tuesday, May 14, 2024
- Advertisement -

మొన్న గీత, నేడు బుట్టా రేణుక……. బాబుకు ఘలక్ ఇస్తున్న ఫిరాయింపు ఎంపిలు

- Advertisement -

చంద్రాబాబు టైం అస్సలు బాగాలేదు. 2019 ఎన్నికల్లో గెలుపు ఓటముల విషయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదుకానీ 2019లో చంద్రబాబు మరోసారి గెలుస్తాడని మాత్రం స్వయంగా టిడిపి నేతలే నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. అత్యంత ఎక్కువ నమ్మకస్తుడు అని చంద్రబాబు నమ్ముతున్న టిడిపి ఎంపి సుజనా చౌదరి…..2014ఎన్నికల్లో టిడిపికి ఆర్థిక అండగా నిలిచిన సుజనా చౌదరి కూడా స్వయంగా తన సన్నిహిత బంధువు అయిన యలమంచిలి రవిని వైకాపాలోకి పంపిస్తున్నాడు. ఇక ఫిరాయింపు ఎంపిలు అందరూ కూడా చంద్రబాబుకు హ్యాండ్ ఇస్తున్నారు.

మొన్నటికి మొన్న జగన్ పార్టీకి దూరమై చాలా పెద్ద తప్పుచేశానని కొత్త పల్లి గీత వాపోయారు. చంద్రబాబును అస్సలు నమ్మలేమని….బాబు పాలనలో కూడా అభివృద్ధి కూడా శూన్యమని ఆరోపణలు చేసి బాబుకు దూరమయ్యారు. ఇక తాజాగా కర్నూలు ఎంపి బుట్టా రేణుక కూడా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చారు. ఎన్నికలు అయిన వెంటనే బాబు పంచన చేరిన ఎంపీలలో ఈమె కూడా ఒకరు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబుకు పూర్తిగా దూరమ్యారు రేణుక. తాజాగా ఢిల్లీలో కుటుంబ సమేతంగా నరేంద్రమోడీని కలిసిన రేణుక బిజెపిలో చేరాలన్న ఆసక్తి చూపించారు.

ఇక మరోవైపు ఎస్పీవై రెడ్డి కూడా వైఎస్ జగన్‌తో కలవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. జగన్‌కి సన్నిహితుడైనా వైకాపా నేతతో టచ్‌లోకి వెళ్ళిన ఎస్పీవై రెడ్డీ సీటు గ్యారెంటీ ఇస్తే వైకాపాలో చేరడానికి రెడీ అని చెప్పాడట. మిగతా విషయాలు ఎలా ఉన్నా 2019ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తాడని బ్యూరోక్రాట్స్‌తో పాటు ఫిరాయింపు నాయకులతో పాటు టిడిపి నాయకులకు కూడా నమ్మకం లేకుండా పోతుండడం మాత్రం విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -