Friday, May 3, 2024
- Advertisement -

జూ.ఎన్టీఆర్, కొడాలి నాని మద్య విభేదాలు.. కస్సుమంటున్న టీడీపీ నేతలు !

- Advertisement -

వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ పరంగా ఎప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పార్టీపై గాని సి‌ఎం జగన్మోహన్ రెడ్డి పై గాని, ఎలాంటి విమర్శలు వచ్చిన తిప్పికొట్టేందుకు కొడాలి నాని ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. ఇక టీడీపీ పార్టీ శ్రేణులపై అలాగే చంద్రబాబు పై నాని చేసే కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతూ ఉంటాయి. అయితే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసే నాని.. నందమూరి వంశంపై మాత్రం ఎప్పుడు కూడా ఆచి తూచి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నందమూరి హరికృష్ణతో పాటు ఆయన తనయుడు జూ. ఎన్టీఆర్ తో నానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది.

ఇక ఆ తరువాత నాని తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీ కండువా కప్పుకోవడంతో జూ. ఎన్టీఆర్ మరియు కొడాలి నాని మద్య దూరం పెరుగుతువచ్చింది. అయితే గతంలో వీరిద్దరి మద్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చినప్పటికి, నాని మాత్రం ఆ వార్తలపై పెద్దగా స్పందిచేవారు కాదు. కానీ తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో వీరిద్దరి మద్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని స్పష్టమైంది. హరికృష్ణ తనకు రాజకీయ బిక్ష పెట్టారని, జూ.ఎన్టీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని, అందువల్ల జూ. ఎన్టీఆర్ తో తనకు విభేదాలు ఉన్నప్పటికి ప్రాణం పోయిన అతని గురించి తప్పుగా మాట్లాడనని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

అయితే కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జూ.ఎన్టీఆర్ ను కొడాలి నాని మోసం చేశారని అందుకే ఎన్టీఆర్ కొడాలిని దూరం పెట్టారని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానం చూపే కొడాలి నాని.. ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మర్చినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్ పై అలాగే జూ. ఎన్టీఆర్ పై అభిమానం ఉన్నట్లు నటిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి జూ. ఎన్టీఆర్ కొడాలి నాని కి మద్య విభేదాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -