ఏపీలోని పేదలకు మరో పండుగను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇళ్లులేని పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనుంది. 30 లక్షల 75వేల మంది మహిళలకు ఇవి అందజేయనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, మరగిరిలో పర్యటించనున్నారు.
నవరత్నాలు-అందరికీ ఇళ్లు పంపిణీలో భాగంగా నేడు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగబోతుంది. 3 గంటల నుంచి 3.45 గంటల వరకు సీఎం జగన్ ప్రసంగం ఉంటుంది. 3.45 గంటల నుంచి 3.55 గంటల వరకు లబ్దిదారులకు సీఎం చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తారు.
అనంతరం 4.10 గంటలకు కొమరగిరి దిగి అక్కడి నుంచి 4.40 గంటలకు విమానంలో 5.20 గంటలకు గవర్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సీఎం నివాసానికి చేరుకుంటారు.ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుండడంతో పేదల మోముల్లో సంతోషం వెల్లివిరిస్తోంది.