Wednesday, May 1, 2024
- Advertisement -

ఆ ఐదు చోట్ల ఎన్నికలకి ఈసీ స్కెచ్..!

- Advertisement -

వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జరగాల్సిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో పరిస్థితులను ఉన్నత స్థాయిలో సమీక్షించేందుకు సీనియర్ అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిల ప్రస్తుత శాసనసభల గడువు 2021 ఏప్రిల్-జూన్ మధ్య ముగియనుంది.

ఈసీ ప్రధాన కార్యదర్శి ఉమేశ్ సిన్హా తమిళనాడుకు వెళ్లనుండగా, డిప్యూటీ కమిషనర్ సుదీప్ జైన్ పశ్చిమ బెంగాల్​లో పర్యటిస్తారని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. శాసనసభ ఎన్నికల నిమిత్తం సుదీప్ జైన్ మూడు రోజులపాటు పశ్చిమ బెంగాల్​లో పర్యటించనున్నారు. తన బృందంతో కలిసి… రాష్ట్ర ఎన్నికల అధికారులతో గురువారం ఆయన సమావేశమవుతారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -