- Advertisement -
టీడీపీకీ రాజీనామా చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కుమారుడు శ్రీహర్ష కూడా వైసీపీలో చేరారు. వీరిద్దరకీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. మొదట టీడీపీలో చేరిన ఆయన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరిన హర్షకుమార్ అమలాపురం సీటును ఆయన ఆశించారు. కానీ, ఆ సీటు దక్కకపోవడంతో హర్షకుమార్ నిరాశకు గురయ్యారు. మనస్తాపంతో టీడీపీకి దూరమయ్యారు.