Thursday, May 2, 2024
- Advertisement -

జగన్ టీంలోకి ఫైర్ బ్రాండ్ టీం.. ఇక టీడీపీకి చుక్కలే..!

- Advertisement -

సీఎంగా జగన్ గద్దెనేక్కగానే ఫైర్ బ్రాండ్లు దూకుడుగల ఎమ్మెల్యేలను పక్కనపెట్టి సామాజిక కోణంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో అది జగన్ పేరు తీసుకు వచ్చిన దూకుడైన నేతలు లేక క్యాబినెట్ వెలవెలబోతోంది. ప్రస్తుతమున్న మంత్రులంతా సాఫ్ట్ గా ఉంటున్నారు. దీంతో వాళ్ళు ప్రతిపక్షాలను కాచుకోవడం లేదన్న ఆవేదన వైసిపి అధిష్టానంలో వ్యక్తమవుతోంది. నిజానికి ఇప్పుడున్న మంత్రివర్గంలో చాలా మంది మంత్రులకు నోట్లో నాలుక లేనట్లు ప్రవర్తిస్తున్నారు.

కచ్చితంగా మంత్రి పదవి ఖాయం అనుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు, స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, కరుణాకర్ రెడ్డి లాంటి వారికి మంత్రి పదవులు లభించలేదు. దీంతో వారంతా పదవులు లేక మౌనంగా ఉండిపోతున్నారు. ఇక మంత్రి పదవులు దక్కినవారంత పెద్దగా నోరు విప్పడం లేదు. దీంతో సీఎం జగన్ ప్రస్తుతం ఖాళీ అయిన రెండు మంత్రి పదవులతో పాటు కొత్తగా క్యాబినెట్ విస్తారించబోతున్నారనే ప్రచారం మొదలైంది. దూకుడైన నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ స్పీకర్ తమ్మినేనికి ఈసారి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగుతోంది.

తమ్మినేనితో పాటు రోజా, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి సహా వైసీపీ తరఫున బాగా వాయిస్ వినిపించేవారికి జగన్ మంత్రి పదవులు ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. పర్ఫామెన్స్ ఆధారంగా ఈసారి మంత్రి పదవులు కేటాయిస్తారని స్తబ్దుగా ఉన్న వారిని తొలిగిస్తారని ప్రచారం మొదలైంది. జగన్ దూకుడుకు ప్లస్ అయ్యేవారిని క్యాబినెట్ లో తీసుకోబోతున్నారని సమాచారం. ఈ నెల చివరి వారంలో జగన్ క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందని వైసిపి వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఫైర్ బ్రాండ్ క్యాబినెట్లోకి ఎంట్రీ అయ్యి ప్రతిపక్ష టీడీపీని చెడుగుడు ఆడే ప్లాన్ ను జగన్ రూపొందించినట్లు తెలుస్తోంది.

రైతన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

సీఎం జగన్ కు లేఖ రాసిన బాలయ్య.. దేనికోసం ?

జగన్ ను పవన్ మిర్శించడం తగ్గించడం వెనుక కారణం..?

పార్టీ నేతలకే జగన్ షాక్.. వారికి ఊహించని పదవులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -