- Advertisement -
సినీనటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి నేత శివాజీ ఇటీవల ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ద్రవిడ చేపడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపనలు రాజకీయంగా ప్రకంపనలు సృస్టించాయి. దక్షిణాదిన ఓ జాతీయ పార్టీ కుట్ర పన్నిందని తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ద్రవిడ పేరుతో ఇతర పార్టీలను బలహీనపరుస్తుందని ఆయన అన్నారు. శివాజీ చేసిన ఆరోపనలపై ఇప్పటికే అనేక పార్టీలు స్పందించాయి.
తాజాగా ఆయన చేసిన ఆరోపణలపై బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు ఆయన ఏపీ డీజీపీ మాలకొండయ్యను కలిశారు. శివాజీ ఆపరేషన్ ద్రవిడ అంటూ ఓ వీడియో విడుదల చేశారని దాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు.