విశాఖకు చెందిన కీలక నేత వైసీపీ ఖండువా కప్పుకున్నారు. వైసీపీనుంచే వలసలు కొనసాగుతుంటే ఇప్పుడు..అధికారపార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రతిపక్ష వైసీపీవైపు చూస్తున్నారు నేతలు.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న రాజన్న తనయుడికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాలతో వారిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు.
గిరిజనులు అందరూ వైయస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రవిబాబు అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే గిరిజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని, వారి హక్కులు రక్షించబడతాయని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.