Monday, May 6, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు షాక్ … జ‌న‌సేన‌లోకి మాజీ స్పీక‌ర్

- Advertisement -

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ జ‌న‌సేన లోకి కూడా వ‌ల‌స‌లు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ స్పీక‌ర్ జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అయ్యారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమైన మనోహర్.. పార్టీలో చేరిక, రాజకీయ భవిష్యత్ పై చర్చించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చిట్టచివరి స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు తనయుడే నాదెండ్ల మనోహర్. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో మనోహర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల పార్టీ ప్రకటించిన కమిటీల్లో మనోహర్ కు ఎఐసీసీలో స్థానం దక్కలేదు. దాంతో అసంతృప్తిగా ఉన్న ఆయ‌న పార్టీకీ రాజీనామా చేశారు.

పవన్ కళ్యాణ్ తో పాటు తన భావాలు ఒకే రకంగా ఉంటాయని మనోహర్ అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై పవన్ కళ్యాణ్‌తో మనోహర్ చర్చించినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా టూర్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ సాయంత్రానికి తిరుపతికి చేరుకోనున్నారు. సాయంత్రం మనోహర్ జనసేనలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -