ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ నాయకుడు గట్టు రాంచందర్ రావు రాజకీయ ప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీలో ఎక్కువ కాలం పని చేశారు.. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తెలంగాణ ఏర్పాటు తర్వాత వైఎఎస్ఆర్ సీపీ నుండి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
నవంబర్ లో గట్టు రామచంద్రరావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభిమానాన్ని పొందడంలో.. గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించి పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు.
గట్టు రాంచందర్ రావు ఈ రోజు YSR తెలంగాణ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల రాంచందర్ రావు గారికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు అనుచరులు సైతం పార్టీలో చేరారు.