- Advertisement -
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 30 వేలకు పైగా నమోదవుతుండం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో సైతం గతవారం రోజులుగా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తిలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉంది.
తెలంగాణలో థర్డ్ వేయ్ ప్రారంభమైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించిది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో దాదాపు 90 శాతం జనాభాలో లక్షణాలు ఉండక పోవడం ఆందోళన కలిగించే అంశం. వీరు ఇతరులకు వ్యాపింపజేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా తెలంగాణలో జనవరి మొదటి వారం నుంచి 15 ఏళ్లు పై బడిన టీనేజర్లకు వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్డోస్ను ఇస్తారు. టీకాలు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది.
ఒమైక్రాన్ ఎక్కడ పుట్టింది..? పుట్టుకకు కారణం ఏంటీ..?