అభివృద్ధికోసమే టీడీపీలో చేరానని చెప్పిన ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి లీకైన వీడియో రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ వీడియోతో గిడ్డి ఈశ్వరి అసలు బాగోతం బట్టబయలైంది. ఇది అధికారపార్టీ టీడీపీని ఇరుకున పెట్టే అశం కావడంతో బాబు ఆందోళనలో ఉన్నారు. ఇన్నాల్లు ప్రతిపక్షపార్టీ నేతలు అభివృద్దిని చూసి పార్టీలో చేరుతున్నారని బాబు చెప్పిన నీతి వ్యాఖ్యాలు తేటతెల్లమయ్యాయి.
పార్టీ మారే ముందు కార్యకర్తలతో టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్లను గిడ్డి ఈశ్వరి వివిరిస్తున్న సందర్భంలో వైసీపీ సానుభూతిపరులు వీడియోను రికార్డ్ చేసి సోషియల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇప్పుడు ఆవీడియో ఆచక్కర్లు కొడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారండం అవసరమా అన్న కార్యకర్తకు ప్రశ్నకు గిడ్డి ఈశ్వరి బాబు అంటె ఇష్టం లేదని…. మంత్రి పదవి ఇస్తానంటె పార్టీలోకి వెల్తున్నానంటూ చెప్పింది.
వాటితోపాటు ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ జరిగితే అప్పుడు.. మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. చేరగానే.. ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇస్తామని చెప్పారు. ఆ పదవికి మంత్రి పదవికి ఉన్నంత పవర్ ఉంటుంది…’ అని అంటూ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.
పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఈశ్వరి మీద ఆగ్రహంతో ఉన్న వైసీపీ సానుభూతి పరులు ఈ వీడియోను ఫేస్బుక్ లో షేర్ చేస్తూ.. ఇదీ అసలు కథ అని పోస్టులు పెడుతున్నారు.