ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కష్టాలు వీడటంలేదు. పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి హైకోర్టుకు చేరింది. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు…. ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది
పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏలకు నోటీసులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. ఫిరాయింపులను అనర్హులుగా ప్రకటించాలని ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఏ అన్నా వెంకటరాంబాబు వేసిన కేసుపై ఈరోజు విచారణ జరిగింది. ఎంఎల్ఏలందరికీ వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ, న్యాయశాఖలకు కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.