అనంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీనేత మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డిని, ఆ పార్టీ కార్పొరేటర్లను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటి వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు.
టీడీపీ ఎమ్మెల్యే వి. ప్రభాకర్ చౌదరీ విసిరిన సవాల్ను స్వీకరించి చర్చకు బయలుదేరిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఆయన ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై అనంత వెంకట్రామి రెడ్డి బహిరంగ చర్చకు సిద్దపడ్డారు. రాంనగర్ పార్క్లో చర్చకు బయలు దేరిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు పిలిచి పోలీసుల చేత అక్రమంగా నిర్బంధించడమేంటని మండిపడ్డారు. ఈ విషయమై ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. అనంత వెంకట్రామిరెడ్డితో పాటు వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ మేయర్ రాగేపరశురా, పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి గృహనిర్బంధం చేశారు. పోలీసులు వైఖరితో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.