Wednesday, May 8, 2024
- Advertisement -

నేను, జేసీ ఒక్క‌టె….

- Advertisement -

సినీన‌టుడు,టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ అభిమానుల‌తో ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడో తెలియ‌ని ప‌రిస్థితి. త‌రుచుగా ఏదైనా షూటింగ్ స‌మ‌యంలో త‌న‌ను చూసెందుకు వ‌చ్చె అభిమానుల‌ను కొట్ట‌డం ద్వారా ప‌దే ప‌దే వివాదాస్ప‌ద‌మ‌వుతూ ఉంటాయి. దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. తనపై పదేపదే విమర్శలు వస్తుండడంతో వాటికి విరుగుడుగా తన క్యారెక్టర్‌ను బాలకృష్ణే పైకి లేపుతున్నారు.

సొంత నియేజ‌క‌వ‌ర్గం హిందూపురంలో బాల‌య్య‌బాబు ప‌ర్య‌టించారు. తాను చాలా మందివాడినని చెప్పుకున్నారు. నమ్మితే ప్రాణమిస్తానన్నారు. అంతటితో ఆగకుండా ఎంపీ జేసిదివాకర్‌ రెడ్డిది తనది ఒకే క్యారెక్టర్‌ అని చెప్పారు. తాను, దివాకర్ రెడ్డి ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టే విధంగా మాట్లాడుతుంటామన్నారు. కానీ నమ్మితే ప్రాణమిచ్చే స్వభావం తనదీ, జేసీది అని బాలకృష్ణ చెప్పారు. తనది, జేసీ దివాకర్ రెడ్డిది ఒకే వ్యక్తిత్వమని బాలకృష్ణ చెప్పడంతో జేసీ మురిసిపోయారు.

ఒకప్పుడు జేసీ దివాకర్‌ రెడ్డిని టీడీపీ బద్ధ శత్రువుగా చూసేది. కానీ ఆయన టీడీపీలో చేరిన తర్వాత పూర్తిగా కలిసిపోయారు. రెండు రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి… తనకు రెడ్ల కంటే కమ్మవాళ్లే ఎక్కువ ఆత్మీయులని, తన ఎదుగుదలకు కమ్మవాళ్లే ఎక్కువగా సహకరించారని చెప్పారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా తాను జేసీ ఒకటే అనడంతో దివాకర్ రెడ్డి ఆనందానికి అవదుల్లేవు. జేసీని బాల‌కృష్ణ ఖుషీ చేశాడ‌ని అంటున్నారు నాయ‌కులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -