Saturday, May 18, 2024
- Advertisement -

టీడీపీ టార్గెట్ విజ‌య‌సాయిరెడ్డి….

- Advertisement -

గ‌త కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడ‌తోపాటు మంత్రులంద‌రూ జ‌గ‌న్‌ను ఎక్క‌వ విమ‌ర్శించ‌కుండా ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయినే టార్గెట్ చేశారు. ఢిల్లీలో జ‌గ‌న్‌కు అనుకూలంగా చ‌క్రం తిప్పుత‌న్నార‌న్న అనుమానంతో చంద్ర‌బాబు నిఘాపెట్టిన‌ట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ఢిల్లీలో బాబు చేస్తున్న లాబియింగ్ ప‌నిచేయ‌డం లేద‌న్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతోంది.

అందుకే గ‌త కొన్ని రోజులుగా విజ‌య‌సాయినే టార్గెట్ చేశారు. బాబుపై విజ‌య‌సాయి విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. బాబును కోర్టు బోనులో నిల‌బెడ‌తాన‌ని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని కూడా విజయసాయిరెడ్డి ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టుగా ఉంది ఏపీ ప్రభుత్వం.

తాజాగా ఢిల్లీ మీడియా స‌మావేశంలో త‌న‌పై పెట్టిన ఇంటెలిజెన్సీ నిఘాను బ‌య‌ట పెట్టారు. విజ‌య‌సాయి ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశానికి జ‌ర్న‌లిస్ట్‌గా వ‌చ్చిన ఇంటెలిజెన్స్ అధికారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇంటెలిజెన్స్ అధికారి అన్న విషయం మాకు తెలుసు. మీడియా సమావేశంలో మీకు పని లేదు. మీరు ఇక వెళ్లవచ్చు. ఏమైనా కావాలంటే నేరుగా అడుగు సమాధానం చెబుతా అంటూ ప్రెస్‌ మీట్‌ మధ్యలో విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు ఇంటెలిజెన్స్ అధికారి అక్కడి నుంచి జారుకున్నారు. దాంతో విజయసాయిని ఇంటెలిజెన్స్ అధికారులు నీడలాగ వెన్నాడున్నారన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -