సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో కష్టాలు వెంటాడుతున్నాయి. పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక ఇదర పార్టీల వైపు చూస్తున్నారు ముఖ్య నేతలు. కీలక నేతలంతా భాజాపా కండువా కప్పుకన్నారు.తాజాగా మరో సిట్టింగ్ ఎంపీ వైసీపీలో చేరుతున్నారనె వార్తలు అమరావతిలో చక్కర్లు కొడుతున్నాయి. సదరు ఎంపీ మొదటి నుంచి ఇస్టం లేకపోయిని సొంత పార్టీ టీడీపీలో ఉన్నారు.
వైసీపీలో చేరుతున్నారన్న ఎంపీ ఎవరో కాదు ….విజయవాడ ఎంపీ కేశినేని నాని.ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇతని మాట వినలేదు ఏమో అందుకే పార్టీపై అసంతృప్తితో ఉన్నాడు అని ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో అన్నారు. కాని ఆతర్వాత సొంత పార్టీ నేతలపైనె విమర్శలు చేసి అవసరం అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు.
గతంలోనె పార్టీ మారుతారనె వార్తలు వచ్చినా అది జరగలేదు.అయితే ఇప్పుడు మరోసారి కేశినేని పార్టీ మారుతారని అది కూడా వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.’అమ్మఒడి పథకం మంచి కార్యక్రమమని, విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేశినేని నాని అన్నారు. ఇలా అంటూనే ‘నేను ఎవరినీ పొగడటం లేదు. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దు.’ అంటూ తనదైన శైలిని చూపించారు.
అయితే నెటిజన్లు ఊరుకుంటారా. ఏంటి కేశినేని .. నేను ఎవరిని పొగడటం లేదు అంటూనే జగన్ ని ఆకాశానికెత్తవు.. త్వరలో వైసీపీలో చేరుతున్నావా ?’ అంటూ కామెంట్లు చేశారు. మరి కేశినేని నాని నిజంగా పార్టీలో చేరుతారా ? లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి