జనసేన అధినేత పవన్పై పచ్చపార్టీ నేతల దాడి సురూ అయ్యింది. గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భావసభలో బాబు,టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ ఎంగడట్టిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు పవన్ను ఏమనని టీడీపీ నేతలు ఒక్కసారిగా ఎదరుదాడి చేయడం మొదలు పెట్టారు. బాబునుంచి మొదలు నాయకులందరూ విమర్శలు ఎక్కుపెట్టారు.
తాజాగా పవన్ ట్విట్టర్లో స్పందిస్తూ విమర్శించే నేతలపై నిప్పులు చెరిగారు. తన వెనుక బీజేపీ ఉందని, ఆ పార్టీ నేతల చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. మొన్నటి దాకా తనను టీడీపీ మనిషినని అన్నారని గుర్తు చేసిన పవన్ం ఇప్పుడేమో బీజేపీ మనిషినని అంటున్నారని, బొక్కలు, లొసుగులు ఉన్న టీడీపీ వారు కేంద్రానికి భయపడతారేమో తప్ప, తాను ఎవరికీ భయపడబోనని, తలొగ్గనని స్పష్టం చేశారు.
మొన్న దాకా ఏమో టీడీపీ మనిషి అన్నారు ఇప్పుడేమో బీజేపీ మనిషి అంటున్నారు. లూప్ హోల్స్ ఉన్న మీరు భయపడతారేమో నేను ఎవరికి భయపడను – @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) March 16, 2018