- Advertisement -

అరే సాంబా.. ఈ కొబ్బ‌రి బోండం మ‌న ప‌లాసాది.. బండ్లో పెట్టండ్రా… !

- Advertisement -

రాష్ట్రంలోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొనేందుకు జనసేన పోరాట యాత్రలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస చేరుకున్న ప‌వ‌న్ అక్క‌డ జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. 2014 ఎన్నికల్లో తెదేపా, భాజపాకు తాను మద్దతు ఇచ్చానని.. వారు జనానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే ప్రజల తరఫున వారిపై పోరాటం చేసేందుకు వచ్చానన్నారు. ఎక్కడైతే దోపిడీ, దౌర్జన్యాలు ఉంటాయో.. అక్కడ కచ్చితంగా తిరుగుబాటు వస్తుందని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం పోరాటాల నేల అని అన్నారు.

బ‌హిరంగ స‌భ‌లో అస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ వేదిక వద్ద ఉన్న అభిమానులు పవన్ కు కొబ్బరిబోండం అందజేసి తాగాల్సిందిగా కోరారు. దీంతో, ఆ కొబ్బరిబోండం అందుకున్న పవన్, ‘ఈ కొబ్బరిబోండం మన పలాసది. విదేశీ పానియాలు ఏం దాహం తీర్చుతాయి! ఇది కదా దాహం తీర్చేది. మన కొబ్బరినీళ్లు.. మన పలాస బోండం తీరుస్తుంది దాహం.. బండిలో పెట్టండి.. దారిలో తాగుతాను’ అంటూ ఆ బోండాన్ని తన సహచరులకు అందజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -