జనసేన అధినేత పవన్ మరో సారి చంద్రబాబుపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అవినీతిమయమైందనే విషయం తనకు ఎన్నికలకు ముందే తెలునని..అప్పటి పరిస్థితులను బట్టి మద్దతు ఇచ్చానని వెల్లడించారు. ధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అవినీతి వందల రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు.
ముఖ్యంగా వైఎస్ఆర్సీ అధినేత జగన్ అంటే చంద్రబాబుకు ఎంత భయమో కూడా తెలుసు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు బయటపెట్టిన పవన్, తాజాగా మరోసారి జగన్ అంటే చంద్రబాబుకు ఎంత భయమో వివరించారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని బాబు అస్సలు ఊహించలేదని, జగన్ ముఖ్యమంత్రి అయిపోతారని, వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆఖరి నిమిషం వరకు చంద్రబాబులో భయం ఉండేదని చెప్పుకొచ్చారు పవన్.
జగన్ నుంచి చంద్రబాబును రక్షించింది జనసేన. ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబును అప్పట్లో రక్షించింది కేవలం జనసేన పార్టీ, జన సైనికులు మాత్రమే. బాబుకు అప్పట్లో అండగా నిలబడింది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, నేను అంటూ విమర్శలు గుప్పించారు.