- Advertisement -
టీడీపీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు.కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరహరదీక్ష చేస్తున్న టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరహర దీక్షకు శుక్రవారం నాడు జెసి దివాకర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. దీక్షల వల్ల కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాదని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఏపీకి ప్రధానమంత్రి మోడీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని చంద్రబాబుకి ఎప్పడో చెప్పిన పట్టించుకోలేదని దివాకర్ రెడ్డి తెలిపారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని ఆయన కోరారు.
