అనంతపురం ఎంపీ జెసీ దివాకర్రెడ్డి పేరును పరిచయం చేయాల్సిన అవసరంలేదు. అవతలి వారు ఎవరైనా సరే ముక్కుసూటిగా మాట్లాడటంలో ఆయనకు ఆయనె సాటి. అంతేకాదు ఎప్పుడూ వివిదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ఆయన మాట్లాడె మాటులు నాయకులకు దిమ్మతిరిగేలా ఉంటాయి.తాజాగా జెసీ నంద్యాల ఉప ఎన్నిక, జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీలు ప్రచారంలో భీకరంగా తలడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని, కానీ మెజార్టీ తక్కువగా వస్తుందని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీసీట్లు, భాజాపాతో పొత్తు ఆంశాలపై స్పందించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీకి కొన్ని విలువలు ఉన్నాయని, వైసిపి అధినేత జగన్తో ఆయన కలువరని తేల్చి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలలో ప్రభుత్వ పై వ్యతిరేకత ఉండటం సహజమేనని చెప్పారు. కాబట్టి మెజార్టీ తగ్గుతుందని జెసి ఆన్నారు.
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలోనే అభివృద్ధి పనులు చేయడం లేదని జెసి చెప్పారు. నంద్యాలలో జగన్ సభ తర్వాత వైసిపి గబ్బు పట్టిందని మండిపడ్డారు. చంద్రబాబు అపర చాణక్యుడు అని జెసి అన్నారు. 2019లో టిడిపి – బిజెపిలు కలిసి నడుస్తాయని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.