Sunday, April 28, 2024
- Advertisement -

పార్టీ మారె యోచ‌న‌లో జీవిత రాజ‌శేఖ‌ర్‌..

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీకి సినీగ్లామ‌ర్‌ను పెంచే ప‌నిలో బిజీగా ఉంది. సీనిర్ హీరోయిన్‌ల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా మ‌రో సీనియ‌ర్ న‌టి ప‌చ్చ‌కండువా క‌ప్పుకోనుంది. అమె ఎవ‌రో కాదు న‌టీమ‌ణి జీవిత‌. నంది అవార్డుల ఎంపిక కమిటీలో పని చేసిన ఆమె టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఇదే సంద‌ర్భంలో మీరు టీడీపీలో చేరుతున్నారా అన్న ప్ర‌శ్న‌కు మీరు చేర‌మంటె చేరుతా అని బ‌దులిచ్చారు. ఎలాగూ పార్టీకి సినిమా గ్లామ‌ర్‌కోసం ఎదురు చూస్తున్న ఉన్న టీడీపీ జీవితకు స్వాగతం పలికే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది.

జీవిత పార్టీలు మార‌డం కొత్తే మి కాదు. నామినేటెడ్ ప‌ద‌వులు ఎవ‌రు ఇస్తె ఆపార్టీలోకి మార‌డం కామ‌న్ అయిపోయింది. మొదట్లో జీవితా-రాజశేఖర్ లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే. ఆ తర్వాత వీళ్లు 2009 సమయంలో కాంగ్రెస్ వైపు వెళ్లారు. అప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవిని వీరు విమర్శించడం, చిరు అభిమానులు వీరిపై దాడికి పాల్పడటం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్లు కాంగ్రెస్ లో చేరిపోయారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ వెంట కొంత కాలం న‌డిచారు. వైసీపీ నిర్వ‌హించిన పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కాని ఎందుకో పార్టీని వీడారు. త‌ర్వాత జీవిత భాజాపా తీర్థం పుచ్చుకున్నారు. జీవితకు సెన్సార్ బోర్డు సభ్యురాలిగా అవకాశం లభించింది. అయితే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు మాత్రం దూరంగానే ఉంటూ వచ్చారు.

ఒకవైపు ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమా విజయంతో ఉత్సాహంతో ఉన్న జీవిత.. చంద్రబాబును ప్రశంసించడం, తెలుగుదేశం పై ఆసక్తి చూపించడం రాజ‌కీయాల్లో హాట్‌గా మారింది. పార్టీలో చేర‌డానికి ఉత్సాహం చూపుతున్నా జీవిత రాజ‌శేఖ‌ర్ దంప‌తులు త్వ‌ర‌లోనె ప‌చ్చ ఖండువా క‌ప్పుకోనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -