కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా అయిన తరువాత చంద్రబాబుపై ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. ఆయన తాజాగా ఢిల్లీలో మరోసారి చంద్రబాబు,ఆయన ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గు, లజ్జా లేవని, నిర్లజ్జగా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.టీడీపీ నేతలు ఆడుతున్న నాటకాలు ఇకనైనా ఆపాలని హితవు పలికారు.
నాలుగు సంవత్సరాలు మంచిగా కనిపించిన మోదీ ఇప్పడు వీళ్ల కళ్లకు చెడుగా ఎలా మారాడో చెప్పాలని తెలుగుదేశం నాయకులను ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులు చేస్తున్న మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్తాం అని,అమిత్ షా త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడిన 2019లో కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందని,మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయం అని చెప్పుకొచ్చారు కన్నా లక్ష్మీనారాయణ.