Friday, May 17, 2024
- Advertisement -

అశోక్‌బాబు, మహేష్ కత్తిలకు దిమ్మతిరిగే షాకులు…..ఘోర అవమానం

- Advertisement -

అలానే ఉంటుంది మరి. ప్రత్యేక హోదా వేస్ట్ అని చంద్రబాబు చెప్పినన్ని రోజులూ అజ్ఙాతవాసంలో ఉన్న ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అశోక్‌బాబుకు ఇప్పుడు సడన్‌గా మెలకువే వచ్చిందో….. తెలివే వచ్చిందో కానీ టిడిపి తరపున వకాల్తా పుచ్చుకుని కర్ణాటకలో ఏదో చేస్తానని వెళ్ళాడు. ఇక పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా రెచ్చిపోయిన మహేష్ కత్తి కూడా తన అసలు రంగు చూపించాడు. ఇన్నాళ్ళు ఈ మహేష్ కత్తి వెనకాల ఉన్నది వైకాపా అన్న పచ్చ మీడియా ప్రచారం అబద్ధం అని తేలిపోయింది. తెలుగుదేశం కార్యకర్త అనేస్థాయిలో చంద్రబాబు కోసం పాటు పడే అశోక్ బాబుతో కలిసి సదరు మహేష్ కత్తి కూడా కర్ణాటక వెళ్ళాడు మరి.

అక్కడ కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలతో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపిని ఓడించాలి అని ఏదో స్పీచులు దంచబోయారు. అయితే కన్నడ తెలుగు ప్రజలు మాత్రం అశోక్‌బాబుకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చావ్…… టిడిపికి తొత్తులా మారావ్…… బాబు హోదా వేస్ట్ అన్నంత కాలం ఏం చేస్తున్నావ్? ఎందుకు మౌనంగా ఉన్నావ్? అసలు ప్రత్యేక హోదా కోసం ఉద్యోగా సంఘాల అధ్యక్షుడి హోదాలో నువ్వు చేసిందేంటి? హోదా వేస్ట్ ప్యాకేజ్ బెస్ట్ అని బాబు అన్నప్పుడు ఎక్కడ నిద్రపోయావ్? నాలుగేళ్ళుగా బిజెపితో కలిసి టిడిపి స్వార్థ ప్రయోజనాలకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెడుతూ ఉంటే కనీసం మాట్లాడలేదేం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కన్నడ తెలుగు ప్రజలు. దాంతో షాకవడం అశోక్ బాబు టీం వంతయింది. ఇక ఈ సమావేశానికి తెలుగు వాళ్ళను రమ్మని ఆహ్వానించిన అశోక్ బాబు టీం సమావేశం మొత్తం కూడా పచ్చ రంగుపులిమారు. టిడిపి సమావేశం అనే స్థాయిలో కలరింగ్ ఇచ్చారు. దాంతో కన్నడ తెలుగు ప్రజలకు ఇంకాస్త మండింది. టిడిపి సమావేశం అని ఉంటే అసలు వచ్చే వాళ్ళమే కాదని…….తెలుగు ప్రజల సమావేశం అని చెప్పి టిడిపి రాజకీయాలు చేయడం ఏంటని మండిపడ్డారు. మొత్తానికి పచ్చ పార్టీ నిధులతో ఎంచక్కా విమానంలో వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కోసం ఏదో చేస్తున్నాం అన్న కలరింగ్ ఇవ్వాలనుకున్న అశోక్ బాబు అండ్ టీంకి కన్నడ తెలుగు ప్రజల దెబ్బకు చుక్కలు కనిపించాయి. 2014లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని టిడిపి కోసం తాకట్టుపెట్టినట్టు…….2014 ఎన్నికల్లో లోపాయికారిగా చంద్రబాబుకు ఓట్లేయించినట్టు………హోదా వేస్ట్ అని బాబు అనగానే హోదాను నీరుగార్చేలా మాట్లాడి సీమాంధ్ర ప్రజలను మోసం చేసినట్టు………ప్రతిసారీ ప్రజలను మోసం చేస్తూనే ఉంటానంటే ఎలా అశోక్‌బాబూ? ప్రజలు మరీ అంత అమాయకులని అనుకుంటే ఎలా? ఉద్యోగ సంఘాల అధ్యక్షుడి వేషం వేసుకుని బాబు కోసం రాజకీయాలు చేసే అశోక్ బాబయ్యా……సమాధానం చెప్పవయ్యా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -