Thursday, May 16, 2024
- Advertisement -

సొంత నియోజ‌క వ‌ర్గంలో కేసీఆర్ కు బిగ్‌షాక్‌..

- Advertisement -

తెలంగాణాలో ముద‌స్తు ఎన్నిక నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంచి ఊపుమీదున్న టీఆర్ఎస్ పార్టీకీ బిగ్‌షాక్ త‌గిలింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్‌.. మరోసారి ఇక్కడి నుంచి ఎన్నిలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా మారిన గజ్వేల్‌లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

టీఆర్ఎస్ కు చెందిన నేతలు, వారి అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. జగదేవ్ పూర్ ఎంపీపీ రేణుకతో పాటు, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్ లు, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేణుకతో పాటు ఎంపీటీసీలు మమతాభాను, కవిత యాదగిరి, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్ లు పార్టీ మారారు.

రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువైన ఈ ప్రాంతం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -