Thursday, May 2, 2024
- Advertisement -

ఫైజర్ కి చేయి చాపిన సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​..!

- Advertisement -

సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​ అబ్దులాజిజ్​(85).. ఫైజర్​-బయోఎన్​టెక్​ కరోనా వ్యాక్సిన్​ తొలి డోసు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన.. నియోం నగరంలో టీకా వేయించుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.ఈ సందర్భంగా.. సల్మాన్​కు కృతజ్ఞతలు తెలిపారు అక్కడి ఆరోగ్య మంత్రి తౌఫిక్ అల్​-రబయా.సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​, ఆయన సోదరుడు ఖలీద్​ బిన్​ సల్మాన్​ సహా.. ఇతర సీనియర్​ అధికారులు ఇప్పటికే టీకా తొలి మోతాదును తీసుకున్నారు.

ఈ మేరకు.. గల్ఫ్​ ప్రాంతంలో ఫైజర్​ టీకా వినియోగాన్ని ఆమోదించిన రెండో దేశంగా సౌదీ నిలిచింది. బహ్రెయిన్​ ఈ జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకుంది.అయితే.. సౌదీ వ్యాప్తంగా మూడు దశల్లో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి దశలోనూ నిర్దిష్ట జనాభా ఆధారంగా టీకా పంపిణీ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం రియాద్​, మక్కా, తూర్పు ప్రావిన్సులోని మూడు వ్యాక్సిన్​ కేంద్రాలలో.. ఇప్పటివరకు లక్ష మందికిపైగా వ్యాక్సినేషన్​ కోసం తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -