Saturday, May 18, 2024
- Advertisement -

సొంత జిల్లా చిత్తూరులో బాబుకు బిగ్ షాక్‌..

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి వ‌ల‌స‌స క‌ష్టాలు త‌ప్ప‌డంలేదు. సొంత జిల్లా చిత్తూరులో బిగ్ షాక్ త‌గిలింది. పార్టీ ఏర్ప‌డిన‌ప్ప‌టినుంచి టీడీపీలో ఉన్న నాయ‌కులు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. జిల్లా తాంబల్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం ఎంపీపీగా ఉన్న కొండా గీతమ్మ, కొండా సిద్ధార్థ్‌ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

జ‌గ‌న్‌పై క‌త్తి దాడి జ‌రిగిన త‌ర్వాత విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పాద‌యాత్ర‌ను మ‌ళ్లీ ప్రారంభించారు. పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ద్వారాకానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కలిశారు. టీడీపీలో 40 ఏళ్ల పాటు కొనసాగిన కొండా సిద్ధార్థ్‌ కుటుంబాన్ని జననేత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ‌గ‌న్ స్వ‌యంగా కండువా క‌ప్పు పార్టీలోకి ఆహ్వానించారు.ఎంతోకాలం టీడీపీలో కొనసాగిన కొండా సిద్ధార్థ్‌ కుటుంబం ఆ పార్టీని వీడిందంటే చంద్రబాబు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు మాపీ ఎంపీ మిథున్ రెడ్డి.

కొండా సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్‌ పాటించిన విలువలు ప్రస్తుతం టీడీపీలో లేవని అన్నారు. అందుకే 40 ఏళ్లు టీడీపీలో ఉన్నప్పటికీ.. విలువల కోసమే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. టీడీపీ నిజమైన నేతలకు, కార్యకర్తలకు ప్రస్తుతం విలువ లేదని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -