Sunday, May 5, 2024
- Advertisement -

కేటీఆర్‌పై నిప్పులు చెరిగిన కొండా సురేఖ‌..

- Advertisement -

టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాలో తమ పేరును ప్రకటించకపోవడంపై కొండా సురేఖ, మురళి దంపతులు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ గుర్తుపైనే గెలిచిన తాము ఆ పార్టీకి చేదు అయ్యామని… టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకరరావు ఎందుకు తీపి అయ్యారని సురేఖ ప్రశ్నించారు.

తమకు వ్యతిరేకంగా పనిచేసే గుండు సుధారాణిని గానీ ఎర్రబెల్లి దయాకర్ రావును గానీ పార్టీలోకి తీసుకున్నప్పుడు తమకు చెప్పలేదని అన్నారు. పార్టీలోకి మొదట వచ్చి, పార్టీ జెండా కింద తాము గెలిచామని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లిని నెత్తిన పెట్టుకున్నారని ఆమె అన్నారు.

హరీష్ రావుకు తాము పార్టీలోకి రావడం ఇష్టం లేదని, అయినా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన తమ వెంట ఉన్నారని, పార్టీలోకి తెచ్చిన కేటీఆర్ తమను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. అందరినీ కేటీఆర్ తనపైకి ఉసిగొలుపుతున్నారని ఆమె అన్నారు. కేటీఆర్ సొంత కోట‌రీని ఏర్పాటు చేసుకున్నార‌న్నారు.

భూపాలపల్లి టికెట్ మధుసూదానాచారికి ఇవ్వకపోతే తమకు ఇవ్వాలని అడిగామని ఆమె చెప్పారు. అయితే, వరంగల్ ఈస్ట్ నుంచి తానే పోటీ చేస్తానని, ఒక్క సీటు చాలునని చెప్పానని, రెండు సీట్లు అడిగారు కాబట్టి సురేఖ అలిగారని బద్నాం చేస్తున్నారని ఆమె అన్నారు. తన పేరు తొలి జాబితాలో ప్రకటించాలని కేటీఆర్ కు చెప్పానని, అదే విషయం సంతోష్ కు కూడా చెప్పానని ఆమె చెప్పారు.

పార్టీలో చేరిన తర్వాత కేటీఆర్ తెల్లారి నుంచి ఫోన్ ఎత్తరని ఆమె అన్నారు. టీఆర్ఎస్ లో చేరిన సురేష్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుందని అన్నారు. కేటీఆర్ కోటరీ తయారు చేస్తున్నారని, తెలంగాణను ఆగం పట్టిస్తున్నారని ఆమె అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -