తెలంగాణా టీడీపీలో మరో సంచలన చోటు చేసుకోబోతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. కొన్ని రోజులుగా రేంవంత్ కాంగ్రెస్లో చేరుతున్నారనె గందరగోలం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ రేవంత్రెడ్డిన వివరన కోరగా ఇప్పటి వరకు స్పందించకపోవడంతో పార్టీనుంచి సస్పెండ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకుని రోజుకో మాట మాట్లాడుతూ తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న రేవంత్ రెడ్డిని తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి లేఖను రాశారు. కాంగ్రెస్ లోకి వెల్లేందుకు రేవంత్ నిర్నయం తీసుకున్నారని ఇక ఉపేక్షిస్తె పార్టీకి నష్టం తప్పదని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం లండన్ లో ఉన్న చంద్రబాబు, నేటి రాత్రికి ఇండియాకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన వచ్చిన తరువాత ఒకటి రెండు రోజుల్లో రేవంత్ పై నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితె చంద్రబాబు రేవంత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీలో ఉత్కంఠ మొదలయ్యింది.