Thursday, April 25, 2024
- Advertisement -

మద్యం అమ్మకాలు ప్రైవేట్ చేతికి : కమల్ హాసన్

- Advertisement -

ఎన్నికల్లో గెలవడానికి ఓటుకు నోట్లు ఇచ్చే రాజకీయ పార్టీలపై విరుచుకుపడ్డారు మక్కల్​ నీది మయ్యం పార్టీ అధినేత కమల్​ హాసన్​. హామీలు నిజాయితీగా ఉండాలన్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని వ్యక్తులకు రూ.5 వేలు చేతిలో పెడితే తీసుకుంటున్నారని.. ఆ ధోరణి మారాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అవినీతిని నిర్మూలించాల్సిన సమయం వచ్చిందన్న కమల్​.. అది ఒక్కరి వల్ల సాధ్యం కాదని, అందుకు ప్రజల సాయం కావాలని మధురై ప్రచార సభలో అన్నారు.

తగిన ప్రణాళికలు లేకుండా ఏ రంగంలోకీ అడుగుపెట్టను. ప్రభుత్వమే ప్రజల కనీస అవసరాలు తీర్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రజలు రాజకీయలను తమ చేతుల్లోకి తీసుకోవాలి” అని కమల్​ పేర్కొన్నారు.

మద్యం గురించి మాట్లాడిన కమల్​.. ‘ఐఎస్​ఎస్​ అధికారుల మద్యం తయారు చేసి విక్రయించడం చూస్తున్నాం. మేం అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తాం. దానికి బదులు ఉచితంగా తాగునీటి సరఫరా చేస్తాం’ అని ప్రజలకు హామీ ఇచ్చారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -