2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొనేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు. ఎన్డీఏనుంచి బయటకు వచ్చిన తర్వాత హస్తంతో నేస్తం కోసం ఉబలాట పడుతున్నారు. బాబు ఎప్పుడూ సొంతంగా పోటీ చేసిందిలేదు. ఏదొక పార్టీతో పొత్తు పెట్టుకొనే అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్తో తప్ప అన్ని పార్టీలతో పొత్తు నెరిపిన బాబు చివరగా మిగిలింది కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీకీ వ్యతిరేకంగా పుట్టిందే తెలుగుదేవం పార్టీ. కాని రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది అనాదిగా వస్తున్నది.
తన రాజకీయ అవసరాలకోసం కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. అమరావతిలో మంత్రులతో నిర్వహించిన సమావేశంలో కూడా హస్తంతో దోస్తీ కడ్తే ఎలా ఉంటుందనేది చర్చించారంట. మెజారిటీ మంత్రుల అభిప్రాయం కూడా అదే వెలుబుచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ఉంటుందని బాబు పార్టీ నేతలకు పరోక్షంగా సంకేతాలిచ్చారు. అయితే మంత్రి అయ్యన్న మాత్రం బాబుకు షాక్ ఇచ్చారు.
కర్మ కాలి ‘కాంగ్రెస్’తో టీడీపీ పొత్తుపెట్టుకుంటే చంద్రబాబు తప్పు చేసినట్టేనని వ్యాఖ్యానించారు. నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి.. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టారని, అటువంటి పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని తాను అనుకోవట్లేదని వ్యాఖ్యానించారు మంత్రి అయ్యన్న పాత్రుడు.కాంగ్రెస్ తో పొత్తును తామే కాదు ప్రజలు కూడా క్షమించరని మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.