Saturday, May 4, 2024
- Advertisement -

షర్మిల పార్టీ ప్రయత్నాలపై మంత్రి గంగుల గరంగరం..!

- Advertisement -

హైదరాబాద్ లోటస్​పాండ్​లో వైఎస్సార్ అభిమానులతో ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లోటల్ పాండ్​లోని తన నివాసంలో సన్నిహితులు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆమె ఇంటి వద్ద అభిమానులు, వైసిపి నేతలు బాణాసంచా కాలుస్తూ కోలాహలం చేశారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం లేదని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. షర్మిల పార్టీ ప్రయత్నాలకు మంత్రి చురకలంటించారు. తెలంగాణలో ఫ్యాక్షనిజం అంగీకరించరని ఎద్దేవా చేశారు. తెరాసలో ఎలాంటి ధిక్కార స్వరాలు లేవని కరీంనగర్​లో గంగుల వివరణ ఇచ్చారు.

బీసీల కోసం బిజేపి నిర్వహిస్తున్న పాదయాత్రపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని… బీసీల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కేంద్రంలో బీసీ సంక్షేమశాఖ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని… చట్టసభల్లో బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించట్లేదని ప్రశ్నించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల బిల్లు తేవాలని డిమాండ్​ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -