డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. నేటి ఉదయం 9 గంటలకు తమిళనాడు రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి నేడు కొలువుదీరనుంది.
కాగా, తన నూతన క్యాబినెట్ను కొలువుదీర్చారు. ఈ మేరకు 34 మంది పేర్లతో జాబితా వెల్లడించారు. ఆ జాబితాలో ఎవరెవరికీ ఏ మంత్రిత్వ శాఖను కేటాయిస్తున్నారో కూడా స్టాలిన్ స్పష్టంచేశారు. ఈ 34 మంది కాబోయే మంత్రుల పేర్లతో కూడిన జాబితాకు తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కూడా ఆమోదం తెలిపారు.
కొత్త జాబితాలోని వివరాల ప్రకారం.. సీనియర్ నాయకుడు సుబ్రమణ్యానికి ఆరోగ్యశాఖ, మరో సీనియర్ నేత దురై మురుగన్కు నీటిపారుదల శాఖ కేటాయించినట్లు సమాచారం. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా, పుదుచ్చేరీ ముఖ్యమంత్రిగా ఎన్నార్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ గాయకుడు మృతి