Sunday, May 12, 2024
- Advertisement -

బ‌హిరంగ స‌భలో వైసీపీ తీర్థం..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ టీడీపీకి షాక్‌ల‌మీద షాకులు త‌గుటుతున్నాయి.ఇప్ప‌టికే ఆపార్టీనుంచి చాలామంది నాయ‌కులు,కౌన్సిల‌ర్లు వైసీపీ తీర్థం పు చ్చుకున్న నేప‌థ్యం తాజాగా ఇప్పుడు మ‌రో భారీ షాక్ త‌గిలింది.గ‌త కొంత కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంపెట్టిన శిల్పా చ‌క్రాపాని బాబుకు గ‌ట్టి దెబ్బేశాడు.పార్టీ అధిష్టానానికి రాజీనామ లేఖ‌ను స‌మ‌ర్పించారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సమావేశంలో శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరులు టీడీపీలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవమానాలను ఏకరువు పెట్టారు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదన్నారు.అందుకే ఇప్పుడు పార్టీని వీడుతున్నారు.

ఈ ఉదయం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి, హైదరాబాద్ లో ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ ను కలిసేందుకు ముఖ్య అనుచరులతో కలసి బయలుదేరారు. ఈ మధ్యాహ్నం తరువాత జగన్ ను కలసి చర్చించనున్న ఆయన, రేపు నంద్యాలలో జరిగే భారీ బహిరంగ సభలో వైకాపా తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో శ్రీశైలం అసెంబ్లీ టికెట్ ఖాయం చేసుకున్న తరువాత ఆయన టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదే డిమాండ్ ను ఆయన తెలుగుదేశం ముందు కూడా ఉంచినప్పటికీ, సరైన స్పందన రాలేదన్న సంగతి తెలిసిందే. ఇక చక్రపాణి రెడ్డి టీడీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారా? అన్న విషయమై స్పష్టత లేదు. ఏదిఏమైనా అనుమానంతో టీడీపీ ఆపార్టీ నాయ‌కుల‌ను దూరంచేసుకుంటుంద‌న‌డంలో సందేహంలేదు.

https://www.youtube.com/watch?v=v8ed1s5VycM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -