జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తన దైన శైలిలో కొన్ని సమస్యలను పరిస్కరిస్తున్నారు. అధికార పార్టీ ఏదైనా అన్యాయం చేసినట్లైతే, ప్రజలు జనసేన అధినేత వద్దకు వెళ్ళడం జనసేన స్పందించడం వెంటనే టీడీపి స్పందించి, వాటిని పరిష్కరిస్తాము అని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము. ఇది అంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదినే చెప్పాలి.
పవన్, టీడీపీ ఇద్దరి మధ్యనున్న మ్యాచ్ ఫిక్సింగ్ అందరికీ తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది. ఆ మధ్య విశాఖ డిసిఐ ఉద్యోగుల తరుపున పవన్ వారికి అండగా పవన్ నిలబడ్డారు. ప్రయివేటు పంర చేయొద్దని నరేంద్రమోదీకి పవన్ మొట్టమొదటిసారిగా లేఖ రాశారు.
అయితే ఆలెటర్ రాయడంతో తమ సమస్య కొంతతీరుతుందనే ఆశలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి. అయితే వప్కు కేంద్రం షాక్ ఇచ్చిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పవన్ రాసిన లెటర్ను కనీసం చూడకుండా దాన్ని చెత్తబుట్టలో పడేవారంట. అది నిజం అయితే జనసేనానికి ఘోర అవమానం జరిగినట్లే.
2014 లో పవన్ మోదీకి మద్దతు తెలిపారు. అప్పట్లో ఆయనకు మోదీకూడా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే రానురాను పవన్, మోదీ మధ్య అంతరం పెరిగింది. ఈమధ్యన పవన్ కేంద్రంపై విమర్శలు చేయడం ఎక్కువయ్యింది. ఒకప్పుడు పక్క పక్కనే కూర్చున్న పవన్ మరియు నరేంద్ర మోడీ ఈ రోజు ఇలా శత్రువుల్లా తయారు. మున్మం మున్ముందు పవన్ తన రియాక్సన్ ఎలా ఉంటుందో చూడాలి.