తెలంగాణా భాజాపాలో మరో బిగ్వికెట్ పడింది. పార్టీకి చెందిన సీనియర్నేత నాగం ఇవాళ సాయంత్రమే బిజెపికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. నాగర్ కర్నూలులో ఆయన తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా బిజెపి మీద కీలకమైన ఆరోపణలు చేశారు నాగం. తెలంగాణ రాష్ట్రలో బిజెపి ఎన్నటికీ అధికారంలోకి రాదని విమర్శించారు. బిజెపిని ఏ కోశాన కూడా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.
నాగం జనార్దన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాలమూరు రాజకీయ నేతగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్ లో ఆయన పలుకీలక పోర్ట్ పోలియోలు నిర్వహించారు. తర్వాత భాజాపాలో చేరిన అనంతరం సొంతంగా నగారా సమితి పేరుతో ఆయన తెలంగాణ రాజకీయాల్లో కొనసాగారు.
భాజాపాలో చేరిన ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నది తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న ఆయనకు భాజాపా తగిన వెలుసుబాటు ఇవ్వలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అంతిమంగా తన అనుచరులతో చర్చించిన నాగం భాజాపాకు టాటా చెప్పి…త్వరలో కాంగ్రెస్గూటికి చేరనున్నారనే వర్తలు హల్ చల్ చేస్తున్నాయి.