మహాకూటమిలో భాగంగా కూకట్ పల్లి అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరుపున దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని వ్యూహాత్మకంగా రంగంలోకి దింపారు చంద్రబాబు. సీనియర్ నేతలను కాదని బాబు సుహాసినిని అభ్యర్తిగా ప్రకటించారు. రాజకీయాలకు కొత్త కావడంతో సీనియర్ నేతలను కలుపుకొని పోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఆమె తీరు నచ్చక టీడీపీ నేత పార్టీకీ రాజీనామా చేశారు.
ఎన్నికల ప్రచారంలో ఆమె వ్యహారతీరు నచ్చలేదని సీనియర్ నేత మాధవరం రంగారావు పార్టీకీ రాజీనామా చేసి కారెక్కారు. తనను సుహాసినీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. ఆయన కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ కార్యక్రమానికి కూకట్ పల్లి, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థులు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీలు కూడా హాజరయ్యారు
నియోజకవర్గ ఫైవ్మెన్ కమిటీలో రంగారావు కీలక పాత్ర పోషించారు. అటు కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్.. ఇటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్కాలనీ డివిజన్లకు ఆయన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. సడెన్ గా ఆయన పార్టీ మారడంతో పార్టీ నేతలు షాకయ్యారు.