టీడీపీకి నంద్యాలలో ఇప్పుడు మరో షాకింగ్ దెబ్బ తగిలింది. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచే పెద్ద షాక్ తగలనుంది. గత కొంత కాలంగా టీడీపీ వ్యవహారాల్లో.. అంటీ ముట్టనట్లుగా ఉంటున్న నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్.. తిరుగుబావుట ఎగురవేసేందుకు రెడీ అవుతున్నట్లు టీడీపీ శ్రేణుల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది.
గత కొంత కాలంగా హరికృష్ణకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని.. ఆశ చూపించిన నారా చంద్రబాబు నాయుడు వేరే వారికి కేటాయించినట్లు తెలుస్తోంది. దాంతో హరికృష్ణ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఇక తన తఢాఖ చూపిస్తానని టీడీపీ నేతల వద్ద శపథం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెపథ్యంలో ఈ నెల 23న జరుగనున్న నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు మూడు రోజుల ముందు టైగర్ హరిశ్చంద్రప్రసాద్, జూనియర్ ఇద్దరూ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరికి పోటీగా బాలకృష్ణతో ప్రచారం చేయించేందుకు చంద్రబాబు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.