Sunday, April 28, 2024
- Advertisement -

బీహార్ కంటే దారుణంగా ఏపీ

- Advertisement -

వైసీపీ నాయకులు నేరాలు, ఘోరాలు రాష్ట్రంలో శ్రుతిమించిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. వైసీపీ గూండాలు ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. తన దగ్గర డ్రైవర్ గా పని చేసిన సుబ్రమణ్యం అనే వ్యక్తిని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు దారుణంగా హత్య చేశాడని లోకేష్ ఆరోపించారు.

ఎమ్మెల్సీనే బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు చెబుతున్నా.. పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నేరాలు చేసేందుకు వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక లైసెన్స్ ఇచ్చిందా అని ప్రశ్నించారు.

సుబ్రమణ్యం హత్యపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వెంటనే అనంతబాబు, అతడి అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సుబ్రమణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.

కేసీఆర్ మౌనానికి కారణమేంటి ?

జగన్ కు జనసేన కౌంటర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -