Thursday, April 25, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో చిల‌క జ్యోతిష్య‌డు ల‌గ‌డ‌పాటి ఎక్క‌డ‌…..?

- Advertisement -

ఆంధ్రా ఆక్టోపస్ గా పేర్గాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే తెలంగాణలో బెడిసికొట్టింది. మెుదటి నుంచి తెలంగాణలో ప్రజలనాడి కాంగ్రెస్ వైపే ఉంటుందని చెప్పిన లగడపాటి రాజగోపాల్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి ఎన్నికల ఫలితాలు. ఇక సోషియల్ మీడియాలో అయితే ల‌గ‌డ‌పాటిని నెటిజ‌న్లు పుట్ బాల్ ఆడుకుంటున్నారు. ఆ దెబ్బ‌కు ఆయ‌న బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు.

తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ మీడియా కోడై కూస్తే.. లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజా కూటమిదే అధికార పీటం అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వాస్తవంగా చెప్పాలంటే గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టించారు. తీరా ఫ‌లితాలు చూస్తే తారుమార‌య్యాయి.

ప్రస్తుతం టీఆర్ఎస్ సుమారు 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో ముందంజలో ఉంది. రాజగోపాల్ సర్వే తారుమారు కావడంతో సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలైపోయింది. ‘ఆకు.. ఆకు తింటావా’ అంటూ ట్విట్టర్‌లో ఆడేసుకుంటున్నారు. లగపాటి రాజగోపాల్ ప్రజలను మోసం చేశారని, తొలిసారి ఆయన కచ్చితత్వాన్ని కోల్పోయారని మండిపడుతున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -