Tuesday, May 14, 2024
- Advertisement -

సెన్సేషనల్ సర్వే: బాబుతో పాటు పచ్చ బ్యాచ్ అంతా ఒంటరి అయ్యారా….?

- Advertisement -

2014 ఎన్నికల సమయంలో అందరూ కూడా చంద్రబాబు మాటలను నమ్మేలా వ్యూహాత్మక ప్రచారం జరిగింది. అధికారంలోకి రావడం ఖాయమని తేలిన మోడీతో కూడా చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేలా మాట్లాడించారు. ఇక పవన్ కళ్యాణ్‌తో కూడా అలాంటి వ్యవహారమే నడిపించారు. దేశంలో ఉన్న రాందేవ్ బాబాలాంటివాళ్ళ నుంచీ రాష్ట్రంలో ఉన్న చిన్నా చితకా నాయకుల వరకూ అందరిచేతా బాబు భజన చేయించడంలో సక్సెస్ అయ్యారు. ఆ రకంగా జగన్‌ని పూర్తిగా ఒంటరిని చేశారు. చంద్రబాబు అబద్ధపు హామీలను, మాటలను నమ్మేలా చేశారు.

కట్ చేస్తే నాలుగేళ్ళ తర్వాత పరిస్థితులు పూర్తిగా రివర్స్‌లో ఉన్నాయని తాజాగా సీనియర్ జర్నలిస్టుల బృందం చేసిన ఒక సర్వే తేల్చిచెప్పింది. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు బృందం గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితులను విశ్లేషించడానికి రాష్ట్రం మొత్తం తిరిగింది. రుణమాఫీల నుంచి హోదాతో సహా అన్ని విషయాల్లోనూ ప్రజలు చంద్రబాబునే తప్పు పడుతున్న పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు పోరాటం మాటలను నమ్మలేమని ప్రజలు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కాపుల రిజర్వేషన్స్ విషయంలో తప్పును కేంద్రంపైకి నెట్టేస్తూ బాబు ఆడిన డ్రామా మొత్తం కూడా గ్రామ స్థాయిలో ఉన్న కాపులకు కూడా స్పష్టంగా అర్థమైపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే ఎన్నో అబద్ధపు హామీలు, మోడీ, పవన్‌లతో సహా ఎంతో మంది భజన పుణ్యమాని 2014 ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించిన చంద్రబాబు ఈ సారి మాత్రం అదే ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాడని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో చంద్రబాబుతో పాటు ఆయన భజన మీడియా ఇతర పచ్చ బ్యాచ్ జనాలను కూడా ఎవ్వరూ నమ్మే అవకాశమేలేదని కచ్చితంగా చెప్పేస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి బాబు అండ్ బ్యాచ్ అందరూ కూడా పూర్తిగా ఒంటరి వాళ్ళు కావడం ఖాయమని…..చరిత్రలో ఎన్నడూ లేనంతగా చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ కూడా అన్ని వర్గాల ప్రజల నమ్మకాలనూ కోల్పోయిందని చెప్పారు. టిడిపి కార్యకర్తలు, నాయకులు కూడా చంద్రబాబు, లోకేష్‌లను నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారని సీినియర్ జర్నలిస్టుల బృందం విశ్లేషించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -