Friday, April 26, 2024
- Advertisement -

ఆస్తి మొత్తం మారుతీరావు ఎవరి పేరు మీదా రాశారో తెలుసా ?

- Advertisement -

మిర్యాలగూడలో అమృత ప్రేమించి ప్రణయ్ ను పెళ్లి చేసుకుందని హత్య చేయించిన మారుతీరావు.. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన వీలునామా రాసిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేడు కోర్టులో ప్రణయ్ హత్య కేసు విచారణ జరుగనుండగా.. చార్జ్ షీట్ కు ఈ వీలునామా పత్రాల కాపీలను పోలీసులు జత చేయనున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు మరణించడంతో.. అతని పేరుని తొలిగించి.. మిగతా వారిపై విచారణ కొనసాగించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్ధించనున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు.. ఇక తన కుమార్తె తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాశారు. తన యావదాస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరిట, మిగతాది భార్య గిరిజ పేరిట రాసిన ఆయన.. దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు.

ఇందుకు సంబంధించిన కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. కుమార్తె అమృత పేరిట ఒక్క పైసా ఆస్తి కూడా రాయలేదు. గతంలో అమృత భర్త ప్రణన్ హత్య తరువాత, తన ఆస్తిలో అధిక భాగాన్ని మారుతీరావు తన కుమార్తె పేరిటే రాసినట్టుగా ప్రచారం జరిగింది. ఆపై జరిగిన పరిణామాలు ఆయన తన వీలునామాను మార్చుకునేలా చేశాయని తెలుస్తోంది. ఇక ఈ కేసులో 102 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1,200 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఏ1గా మారుతీరావు ఉండగా, ఏ6గా ఆయన తమ్ముడు శ్రవణ్ ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -