రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనపార్టీగురించే ముమ్మరంగా చర్చజరుగుతోంది. ఇన్నాల్లు ట్వీట్లకే పరిమిత మయిన పవన్ ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగుతున్నారు. మొదట తెలంగాణాలో మూడు రోజు తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. సినిమాలకు కూడా పుల్స్టాప్ పెట్టి పూర్తి సమయం అంతా పార్టీకోసం వెచ్చిస్తానని ప్రకటించారు. ఇక ఏపీలోకూడా పవన్ ప్రభావం చూపుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీ నేత ఆదిశేషగిరిరావు ఓఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో జనసేనపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పవన్ కల్యాణ్ గారు చేసే వ్యాఖ్యలకు అర్థం ఉండదన్నారు. ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఆయనే తెలియదని ఎద్దేవ చేశారు. పవన్ తోలుబొమ్మలాటలో కేతిగాడు వచ్చినట్టుగా మధ్యమధ్యలో వచ్చి ఆయనేదో మాట్లాడి వెళుతుంటారు. పవన్ కల్యాణ్ ది కామెడీ ఎపిసోడ్ లాంటిదని ఎద్దేవ చేశారు.
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీట నొక్కితే అప్పుడు వచ్చి మాట్లాడి వెళిపోతుంటారు. ఏపీలో పలు సమస్యలు ఉంటే సరైన సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారా? టీడీపీ ఏం కావాలంటే ‘జనసేన’ అది మాట్లాడుతోంది’ అని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దాంట్లో నిజంలేకపోలేదు.