దేశ వ్యాప్తంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ ప్రభంజనం మరింత బలపడిందని స్పష్టం అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు బీజేపీ పట్ల ఉన్న తక్కువ భావనను ప్రతిపక్షాలు తుడిచి వేయాలని బీజేపీ నేతలు అంటున్నారు. “కరోనా” కట్టడి చేయడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతం అయ్యాయి. “కరోనా” అనంతర పరిస్థితి మెరుగుపరచడంలో మోడీ విజయవంతం సాధించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గాలి వీయడం పట్ల జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. మోదీ ప్రభుత్వం జాతీయ దృక్పథంతో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని చేపడుతున్న కార్యక్రమాలు ఈ విజయాల వెనుక కీలకాంశాలుగా నిలిచాయని పేర్కొన్నారు. దేశంలో బిజెపి అనుకూల ఫలితాలు పార్టీ కి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
ఆత్మనిర్భర్ భారత్ కార్యాచరణతో పాటు, భిన్న వర్గాల వారిని బలోపేతం చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన పథకాలు సగటు ఓటర్లను ఆలోచింపచేశాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజా విశ్వాసాన్ని పొందిందని, తెలంగాణలో దుబ్బాకతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు పొందడానికి మోదీ పాలనే కారణమని అన్నారు.
పవన్ కళ్యాన్ కి కృతజ్ఞతలు తెలిపిన మెట్రో.. కారణం అదేనా?
పవన్ కళ్యాణ్ తన సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెట్టాడే..?