వచ్చె ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితె పవన్ ఎక్కడనుంచి పోటీ చేస్తారనె విషయంపై సందిగ్ధం నెలకొంది. గతంలో అనంతపురంనుంచి పోటీ చేస్తారనె ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితె తాజాగా పవన్ ఎక్కడనుంచి పోటీ చేస్తారనెదానిపై క్లారిటి ఇచ్చింది జనసేన పార్టీ.
పవన్ అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తామని తెలిపారు. పవన్ కల్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని తెలిపారు.
పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని తెలిపారు. జనసేనలో పవన్ ఒక్కరు మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాట శిలాశాసనం అని అన్నారు. డిసెంబర్ తొలివారం తరువాత తన పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి పోటీ చేస్తారా లేక వేరె నియేజక వర్గంనుంచి పోటీ చేస్తారనేది త్వరలో తెలుస్తుంది.